ఏప్రిల్ 27న కళాభవన్ ఆధ్వర్యంలో 'త్యాగరాజ మ్యూజికల్ ఫెస్టివల్'
- April 22, 2018
మస్కట్: కళాభవన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్, త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ని ఏప్రిల్ 17న నిర్వహించనుంది. బౌషర్లోని బౌషర్ క్లబ్ హాల్లో ఈ ఈవెంట్ జరగనుంది. త్యాగరాజకి నివాళులర్పించే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కర్నాటక సంగీతంలో త్యాగరాజకి వున్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసినవే. మస్కట్లో ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ (కాన్సులర్) పికె నాయర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. తిరువారూర్లో 1767లో త్యాగరాజ జన్మించారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో వుంది ఈ ప్రాంతం. పలు రాగాల్లో పలు కృతిలను త్యాగరాజ కంపోజ్ చేశారు. భారతదేశానికి ఆయన అందించిన అమూల్యమైన సంపదగా వీటిని అభివర్ణిస్తుంటారు మ్యూజిక్ లవర్స్. ఒమన్లో గత 11 ఏళ్ళుగా త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ని కళాభవన్ నిర్వహిస్తోంది. కర్నాటక సంగీతం, ఇండియన్ క్లాసికల్ డాన్స్, సినిమాటిక్ డాన్స్, కీబోర్డ్, తబలా, మృదంగం, డ్రమ్స్, ఇతర వాద్య పరికరాలు, వాటితోపాటుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అలాగే కరాటే వంటి వాటిల్లో శిక్షణ ఇస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









