ఏప్రిల్ 27న కళాభవన్ ఆధ్వర్యంలో 'త్యాగరాజ మ్యూజికల్ ఫెస్టివల్'
- April 22, 2018
మస్కట్: కళాభవన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్, త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ని ఏప్రిల్ 17న నిర్వహించనుంది. బౌషర్లోని బౌషర్ క్లబ్ హాల్లో ఈ ఈవెంట్ జరగనుంది. త్యాగరాజకి నివాళులర్పించే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కర్నాటక సంగీతంలో త్యాగరాజకి వున్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసినవే. మస్కట్లో ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ (కాన్సులర్) పికె నాయర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. తిరువారూర్లో 1767లో త్యాగరాజ జన్మించారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో వుంది ఈ ప్రాంతం. పలు రాగాల్లో పలు కృతిలను త్యాగరాజ కంపోజ్ చేశారు. భారతదేశానికి ఆయన అందించిన అమూల్యమైన సంపదగా వీటిని అభివర్ణిస్తుంటారు మ్యూజిక్ లవర్స్. ఒమన్లో గత 11 ఏళ్ళుగా త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ని కళాభవన్ నిర్వహిస్తోంది. కర్నాటక సంగీతం, ఇండియన్ క్లాసికల్ డాన్స్, సినిమాటిక్ డాన్స్, కీబోర్డ్, తబలా, మృదంగం, డ్రమ్స్, ఇతర వాద్య పరికరాలు, వాటితోపాటుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అలాగే కరాటే వంటి వాటిల్లో శిక్షణ ఇస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







