ఏప్రిల్ 27న కళాభవన్ ఆధ్వర్యంలో 'త్యాగరాజ మ్యూజికల్ ఫెస్టివల్'
- April 22, 2018
మస్కట్: కళాభవన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్, త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ని ఏప్రిల్ 17న నిర్వహించనుంది. బౌషర్లోని బౌషర్ క్లబ్ హాల్లో ఈ ఈవెంట్ జరగనుంది. త్యాగరాజకి నివాళులర్పించే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కర్నాటక సంగీతంలో త్యాగరాజకి వున్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసినవే. మస్కట్లో ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ (కాన్సులర్) పికె నాయర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. తిరువారూర్లో 1767లో త్యాగరాజ జన్మించారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో వుంది ఈ ప్రాంతం. పలు రాగాల్లో పలు కృతిలను త్యాగరాజ కంపోజ్ చేశారు. భారతదేశానికి ఆయన అందించిన అమూల్యమైన సంపదగా వీటిని అభివర్ణిస్తుంటారు మ్యూజిక్ లవర్స్. ఒమన్లో గత 11 ఏళ్ళుగా త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ని కళాభవన్ నిర్వహిస్తోంది. కర్నాటక సంగీతం, ఇండియన్ క్లాసికల్ డాన్స్, సినిమాటిక్ డాన్స్, కీబోర్డ్, తబలా, మృదంగం, డ్రమ్స్, ఇతర వాద్య పరికరాలు, వాటితోపాటుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అలాగే కరాటే వంటి వాటిల్లో శిక్షణ ఇస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







