బీభత్సం సృష్టించిన యువతులు..తప్పతాగి ఫుట్‌పాత్‌పై

- April 22, 2018 , by Maagulf
బీభత్సం సృష్టించిన యువతులు..తప్పతాగి ఫుట్‌పాత్‌పై

వీకెండ్ వస్తే చాలు హైద్రాబాద్‌ రోడ్లపై వెళ్లాలంటే హడలెత్తాల్సిందే. ! ఎవరూ ఏవైపు నుంచి తప్పతాగి యాక్సిడెంట్ చేస్తారో తెలియని పరిస్థితి. ఆఖరికి ఫుట్‌పాత్‌పై ఉన్నా..గ్యారంటీ లేకుండాపోయింది. తాజాగా కుషాయిగూడలో పూటుగా తాగిన యువతులు..అడ్డగోలుగా కారు డ్రైవింగ్ చేశారు. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లడంతో అక్కడే నిద్రిస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు యువతులు వీకెండ్ పార్టీ చేసుకున్నారు. ఏమాత్రం సోయి లేకుండా పీకలదాకా తాగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దనే మినిమమ్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేశారు. కారుతో రోడ్డుపైకి ఎక్కి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు మాత్రం..చావుబతుకుల మధ్య ఉన్న బాధితుడిని పట్టించుకోలేదు. నలుగురు యువతుల తల్లిదండ్రులతో బేరసారాలకు దిగారు. దీంతో ఇదంతా గమనిస్తున్న స్థానికులు..పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీలను నిలదీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com