సౌదీ అరేబియా:రోడ్డు ప్రమాదంలో 4 గురు ఉమ్రా యాత్రీకుల మృతి

- April 23, 2018 , by Maagulf
సౌదీ అరేబియా:రోడ్డు ప్రమాదంలో 4 గురు ఉమ్రా యాత్రీకుల మృతి

సౌదీ అరేబియాలో నలుగురు బ్రిటన్‌కి చెందినవారు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటిష్‌ ట్రావెల్‌ కంపెనీ పేర్కొంది. హాషిమ్‌ ట్రావెల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 18 మందితో యాత్రీకులతో కూడిన బస్సు మక్కా నుంచి మదీనా వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. గాసోలైన్‌ ట్యాంకర్‌ని బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా వెస్ట్‌ ప్రాంతంలోని అల్‌ ఖైస్‌కి దగ్గరలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫారిన్‌ ఆఫీస్‌ పేర్కొంది. 15 ఏళ్ళుగా యాత్రీకులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com