'భరత్ అనే నేను' విజయోత్సవ వేడుకకు రంగం సిద్ధం
- April 24, 2018సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా బ్లాక్బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అదరగొట్టేశాడు. మహేష్ నటన, దేవి శ్రీ సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలను మించి పరుగులు పెడుతోంది.
భారీ కల్లెక్షన్స్తో కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా పట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం తమ నీరాజనాలు తెలిపారు. ఓ వైపు కలెక్షన్ల సునామీ, మరోవైపు సినీ ప్రముఖుల ప్రశంసలతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. ఇచ్చిన హామీ నెరవేర్చామని తెగ సంబర పడుతున్న టీమ్.. 'భరత్' విజయోత్సవ వేడుక చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ వేడుకకు తిరుపతి వేదిక కానుంది. తిరుపతిలోని అలిపిరి రోడ్లో ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు కొద్దిసేపటిక్రితమే అఫీషియల్ ప్రకటన బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు