ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- April 26, 2024యూఏఈ: ఏవియేషన్ అథారిటీ మొదటి వెర్టిపోర్ట్ కోసం ఆపరేషనల్ అనుమతిని మంజూరు చేసింది. ఈ నౌకాశ్రయాలు సంప్రదాయ విమానాల రన్వేలు లేకుండా ఎగిరే వాహనాల నిలువు టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం అవసరం అవుతాయి. ప్రయాణీకుల పికప్, డ్రాప్-ఆఫ్ మరియు బ్యాటరీ ఛార్జింగ్ కోసం కేంద్రాలుగా ఇవి పనిచేస్తాయి. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) ఆమోదం యూఏఈ వినూత్న రవాణా పరిష్కారాల సాధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. GCAA డైరెక్టర్ జనరల్ సైఫ్ మొహమ్మద్ అల్ సువైదీ మాట్లాడుతూ.. యూఏఈలో అధునాతన ఎయిర్ మొబిలిటీని వేగవంతం చేయడానికి పరిశ్రమల నిబద్ధతను ప్రదర్శిస్తుందన్నారు. ఇది జాతీయ నిబంధనలను సపోర్టింగ్ చేయడంలో మరియు వెర్టిపోర్ట్ల సురక్షిత పునాదులను రూపొందించడంలో తమ విధానాన్ని తెలియజేస్తోందన్నారు. అధునాతన ఎయిర్ మొబిలిటీ పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి, రవాణా పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మొదటి అడుగుగా భావిస్తున్నారు. అబుదాబిలో జరిగిన DRIFTx ఈవెంట్లో ఈ ప్రకటన వెలువడింది. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ (ADIO), ఎమిరేట్స్ స్మార్ట్ & అటానమస్ వెహికల్ ఇండస్ట్రీ (SAVI) క్లస్టర్ల సహకారంతో ఈ వెర్టిపోర్ట్ తాజా పురోగతిని ప్రదర్శించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..