ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- April 26, 2024
యూఏఈ: ఏవియేషన్ అథారిటీ మొదటి వెర్టిపోర్ట్ కోసం ఆపరేషనల్ అనుమతిని మంజూరు చేసింది. ఈ నౌకాశ్రయాలు సంప్రదాయ విమానాల రన్వేలు లేకుండా ఎగిరే వాహనాల నిలువు టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం అవసరం అవుతాయి. ప్రయాణీకుల పికప్, డ్రాప్-ఆఫ్ మరియు బ్యాటరీ ఛార్జింగ్ కోసం కేంద్రాలుగా ఇవి పనిచేస్తాయి. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) ఆమోదం యూఏఈ వినూత్న రవాణా పరిష్కారాల సాధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. GCAA డైరెక్టర్ జనరల్ సైఫ్ మొహమ్మద్ అల్ సువైదీ మాట్లాడుతూ.. యూఏఈలో అధునాతన ఎయిర్ మొబిలిటీని వేగవంతం చేయడానికి పరిశ్రమల నిబద్ధతను ప్రదర్శిస్తుందన్నారు. ఇది జాతీయ నిబంధనలను సపోర్టింగ్ చేయడంలో మరియు వెర్టిపోర్ట్ల సురక్షిత పునాదులను రూపొందించడంలో తమ విధానాన్ని తెలియజేస్తోందన్నారు. అధునాతన ఎయిర్ మొబిలిటీ పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి, రవాణా పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మొదటి అడుగుగా భావిస్తున్నారు. అబుదాబిలో జరిగిన DRIFTx ఈవెంట్లో ఈ ప్రకటన వెలువడింది. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ (ADIO), ఎమిరేట్స్ స్మార్ట్ & అటానమస్ వెహికల్ ఇండస్ట్రీ (SAVI) క్లస్టర్ల సహకారంతో ఈ వెర్టిపోర్ట్ తాజా పురోగతిని ప్రదర్శించారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







