'భరత్ అనే నేను' విజయోత్సవ వేడుకకు రంగం సిద్ధం
- April 24, 2018సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా బ్లాక్బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అదరగొట్టేశాడు. మహేష్ నటన, దేవి శ్రీ సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలను మించి పరుగులు పెడుతోంది.
భారీ కల్లెక్షన్స్తో కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా పట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం తమ నీరాజనాలు తెలిపారు. ఓ వైపు కలెక్షన్ల సునామీ, మరోవైపు సినీ ప్రముఖుల ప్రశంసలతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. ఇచ్చిన హామీ నెరవేర్చామని తెగ సంబర పడుతున్న టీమ్.. 'భరత్' విజయోత్సవ వేడుక చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ వేడుకకు తిరుపతి వేదిక కానుంది. తిరుపతిలోని అలిపిరి రోడ్లో ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు కొద్దిసేపటిక్రితమే అఫీషియల్ ప్రకటన బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం