యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం

- May 07, 2024 , by Maagulf
యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం

యూఏఈ:  తెలంగాణలోని బాలపెల్లి గ్రామానికి చెందిన బైరి రంజిత్ కుమార్ ఏప్రిల్ 28న యూఏఈలోని అజ్మాల్లో మరణించాడు. విషయం తెలుసుకున్న జైత నారాయణ రాయమల్లు నర్సింహులు,  అతని తమ్ముడు రంజిత్ పార్దీవ దేహాన్ని ఇండియాకు తరలించడానికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. దౌత్యపరమైన క్లియరెన్స్ కోసం అవసరమైన పేపర్లను దగ్గరుండి సిద్ధం చేసారు. ఇండియాలో రాగుల వెంకటేష్ మెరుగు సురేష్ సాయంతో పేపర్లు క్లియర్ చేసి దుబాయ్ ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకున్నారు. వీరందరి సహకారంతోని రంజిత్ కమార్ మృతదేహం ఇండియాకు చేరుకుంది.మే 6వ తేదీన మృతుడి స్వగ్రామంలో దహన  సంస్కారాలు పూర్తి చేశారు.ఈ సందర్భంగా సహాయంగా నిలిచిన ప్రతి ఒక్కరికి రంజిత్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com