పాతబస్తీలోని పోలీసులు నిషేధాజ్ఞలు...
- December 05, 2015
పాతబస్తీలోని అన్ని ప్రాంతాలలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం (6వ తేదీ) ఉదయం నుంచి 7వ తేదీ సోమవారం ఉదయం వరకు ఆంక్షలు కొనసాగుతాయని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఎప్పటిలాగే ప్రార్థనలు, పూజలు యథావిధిగా కొనసాగించుకోవచ్చన్నారు. బ్లాక్ డేను పురస్కరించుకొని పాతబస్తీలో 20 ప్లాట్లూన్ల పారా మిలటరీ దళాలు, 50 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 150 మంది సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు దక్షిణ మండలంలోని అన్ని పోలీస్స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్థానికులు తమతో సహకరించాలని ఆయన కోరారు. ర్యాలీలు నిర్వహించడానికి ఇప్పటి వరకు ఏ మత సంస్థకూ అనుమతి ఇవ్వలేదన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!









