పాతబస్తీలోని పోలీసులు నిషేధాజ్ఞలు...
- December 05, 2015
పాతబస్తీలోని అన్ని ప్రాంతాలలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం (6వ తేదీ) ఉదయం నుంచి 7వ తేదీ సోమవారం ఉదయం వరకు ఆంక్షలు కొనసాగుతాయని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఎప్పటిలాగే ప్రార్థనలు, పూజలు యథావిధిగా కొనసాగించుకోవచ్చన్నారు. బ్లాక్ డేను పురస్కరించుకొని పాతబస్తీలో 20 ప్లాట్లూన్ల పారా మిలటరీ దళాలు, 50 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 150 మంది సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు దక్షిణ మండలంలోని అన్ని పోలీస్స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్థానికులు తమతో సహకరించాలని ఆయన కోరారు. ర్యాలీలు నిర్వహించడానికి ఇప్పటి వరకు ఏ మత సంస్థకూ అనుమతి ఇవ్వలేదన్నారు.
తాజా వార్తలు
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!









