పాతబస్తీలోని పోలీసులు నిషేధాజ్ఞలు...
- December 05, 2015
పాతబస్తీలోని అన్ని ప్రాంతాలలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం (6వ తేదీ) ఉదయం నుంచి 7వ తేదీ సోమవారం ఉదయం వరకు ఆంక్షలు కొనసాగుతాయని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఎప్పటిలాగే ప్రార్థనలు, పూజలు యథావిధిగా కొనసాగించుకోవచ్చన్నారు. బ్లాక్ డేను పురస్కరించుకొని పాతబస్తీలో 20 ప్లాట్లూన్ల పారా మిలటరీ దళాలు, 50 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 150 మంది సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు దక్షిణ మండలంలోని అన్ని పోలీస్స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్థానికులు తమతో సహకరించాలని ఆయన కోరారు. ర్యాలీలు నిర్వహించడానికి ఇప్పటి వరకు ఏ మత సంస్థకూ అనుమతి ఇవ్వలేదన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







