ఫేస్బుక్ ఎఫెక్ట్...-కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ మూసివేత
- May 03, 2018లండన్: ఫేస్బుక్ను వివాదాంశంగా మార్చిన కేంబ్రిడ్జి అనలిటికా కన్సెల్టెన్సీ సంస్థను మూసివేస్తున్నట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. అమెరికా, బ్రిటన్లలో వారి కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించారు. ఫేస్బుక్ వివాదం కారణంగా తాము వినియోగదారులను కోల్పోయామని, ఇక మీదట కంపెనీని కొనసాగించలేమని వెల్లడించారు. అయితే కేంబ్రిడ్జి అనలిటికాను మూసేసినా ఫేస్బుక్ వివాదం నేపథ్యంలో దానిపై దర్యాప్తు కొనసాగుతుందని బ్రిటన్ డేటా రెగ్యులేటర్ వెల్లడించింది. కేంబ్రిడ్జి అనలిటికా, దాని మాతృసంస్థకు సంబంధించిన అన్ని విషయాలపైనా దర్యాప్తు చేస్తామని, కంపెనీ మూసివేత ప్రకటనపైనా పరిశీలిస్తున్నామని ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయం(ఐసీఓ) అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఐసీఓ సివిల్, క్రిమినల్ దర్యాప్తు కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ