బ్యాంకాక్ :కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
- May 04, 2018
బ్యాంకాక్ : గనుల తవ్వకాలు జరిగిన ప్రాంతంలో పైభాగంలో ఉన్న కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. మరికొంతమంది మిస్ అయ్యారు. అదృశ్యమైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఉత్తర మయన్మార్లోని జేడ్ మైనింగ్ ప్రాంతంలో ఈ ఘటనలో చోటుచేసుకుంది. జేడ్ మైనింగ్ స్థలంలో ప్రతీ రోజు భారీ యంత్రాలతో తవ్వకాలు కొనసాగుతుంటాయి. తవ్వకాల్లో మిగులు మట్టి, రాళ్ల సంబంధిత వ్యర్థాలు పెద్ద మొత్తంలో కుప్పకుప్పలుగా పేరుకుపోతాయి. దీనివల్ల కొంచచరియలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2015లో ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







