సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి'
- May 04, 2018
నాగ అశ్విన్ డైరెక్షన్లో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించిన సినిమా మహానటి. ఎవర్ గ్రీన్ అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేశన్ పాత్రలో నటిస్తున్నాడు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్బాబు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్పై దృష్టి సారించింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా ప్రారంభం నుంచే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సినిమాపై భారీ బజ్ నెలకొంది. సావిత్రి జీవిత కథను తెలుసుకునేందుకు ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







