సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి'
- May 04, 2018
నాగ అశ్విన్ డైరెక్షన్లో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించిన సినిమా మహానటి. ఎవర్ గ్రీన్ అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేశన్ పాత్రలో నటిస్తున్నాడు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్బాబు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్పై దృష్టి సారించింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా ప్రారంభం నుంచే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సినిమాపై భారీ బజ్ నెలకొంది. సావిత్రి జీవిత కథను తెలుసుకునేందుకు ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..