సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి'
- May 04, 2018
నాగ అశ్విన్ డైరెక్షన్లో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించిన సినిమా మహానటి. ఎవర్ గ్రీన్ అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేశన్ పాత్రలో నటిస్తున్నాడు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్బాబు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్పై దృష్టి సారించింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా ప్రారంభం నుంచే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సినిమాపై భారీ బజ్ నెలకొంది. సావిత్రి జీవిత కథను తెలుసుకునేందుకు ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







