మళ్లీ పంజా విసురుతున్న ఎబోలా..

- May 08, 2018 , by Maagulf
మళ్లీ పంజా విసురుతున్న ఎబోలా..

కాంగో:ఎబొలా వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. కాంగోలో తాజాగా ఈ వ్యాధి బారిన పడి 17 మంది చనిపోయారని కాంగో ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఒ కాంగో ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఎబోలాను నియంత్రించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని సిద్ధం చేసింది. ఎబోలా వ్యాధి కాంగోను 1976 నుంచే పట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని తొలిసారిగా జైర్‌ ప్రాంతంలో బెల్గెన్ నేతృత్వంలోని బృందం కనుగొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com