ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి ..ఏడుగురి మృతి

- May 13, 2018 , by Maagulf
ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి ..ఏడుగురి మృతి

ఇండోనేషియాలోని సురాబయా నగరం మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఆదివారం మూడు చోట్ల జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది బలయ్యారు. సురాబయాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయినట్లు ఇండోనేషియా మీడియా వెల్లడించింది. సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల్లో ఓ మహిళ కూడా ఉందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com