మరో రెండురోజులు పాటు ధూళి తుఫాను

- May 13, 2018 , by Maagulf
మరో రెండురోజులు పాటు ధూళి తుఫాను

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలలో, దక్షిణాది ప్రాంతాలలో మరో రెండురోజులు పాటు ధూళి తుఫాను, పిడుగులు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం తుఫాను ధాటికి నాలుగురాష్ట్రాలలో 41మంది మృతిచెందగా,చాలా మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో చిన్న పిల్లలతో సహా 12మంది మృతిచెందారు. భారీ ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు కూలి విద్యుత్‌ తీగలపై పడటంతో, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 70 విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, శివారు ప్రాంతాలలో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు రైలు, మెట్రో సేవలు నిలిచిపోయినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com