2 బస్సుల ఢీ: 32 మందికి గాయాలు
- May 14, 2018
అబుదాబీలో జరిగిన ఓ రోడ్డు మ్రాదంలో 32 మంది గాయాల పాలయ్యారు. పెప్సికోలా ఇంటర్సెక్షన్ వద్ద రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ రెడ్ సిగ్నల్ని జంప్ చేయడమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ఆపరేషన్స్ రూమ్కి సాయంత్రం 4.35 నిమిషాల సమయంలో సమాచారం అందడంతో, వెంటనే పోలీస్ పెట్రోల్స్, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అబుదాబీ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖలీఫా మొహమ్మద్ అల్ ఖయిల్ చెప్పారు. 31 మందికి ఓ మోస్తరు గాయాలయ్యాయనీ, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయనీ, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారాయన.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







