వేసవిలో అతిదాహాన్ని కట్టడి చేసే నేరేడు..
- May 18, 2018
వేసవి కాలంలో అతిదాహాన్ని కట్టడి చేసే గుణాలు నేరేడు పండ్లలో వున్నాయి. వేసవిలో నేరేడు పండ్లు తీసుకోవండం ద్వారా శరీరానికి చలువనిస్తుంది. మూత్రాశయ రుగ్మతలను నేరేడు పండ్లు నయం చేస్తాయి. కిడ్నిల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి.
కడుపులోనులి పురుగులను నివారిస్తుంది. నోటి, మూత్రాశయ క్యాన్సర్కు టానిక్లా పని చేస్తుంది. కడుపులో ప్రమాదవశాత్తు చేరుకున్న తల వెంట్రుకలను సైతం నేరేడు కరిగిస్తుంది. నేరేడు రసంలో కొంచెం చెక్కర కలిపి తాగితే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.
విత్తనాలు ఎండబెట్టి చేసిన చూర్ణం తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులోకి వస్తుంది. నేరేడు పుల్లతో పండ్లు తోముకుంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ళు నుంచి రక్తస్రావం తగ్తుతుంది. నోటి దుర్వాసన దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
నేరేడుపండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్, సోడియం, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. నేరేడు పండ్లను తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయి అదుపులోకి వస్తుంది.
రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు వీటని తీసుకుంటే శరీరానికి మంచిది. జీర్ణక్రియ మెరుగవ్వాలంటే.. కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండ్ల రసం కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !