అమెరికా స్కూల్లో కాల్పులు...
- May 18, 2018
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణ ఘటనలో 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శాంటా హైస్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులకు తెగబడిన దుండగుడిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. శాంటా హైస్కూల్లోకి చొరబడ్డ ఓ వ్యక్తి.. తుపాకీ పట్టుకొని తిరుగుతూ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల శబ్దాలు రావడంతో తరగతి గదుల్లోంచి బయటకు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించి.. పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఈ పాఠశాలలో సుమారు 1400 మంది విద్యార్థులు ఉన్నారు. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. కాల్పుల తర్వాత తమ పిల్లల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందాయి. సంఘటనా స్థలంలో పేలుడు పరికరాలను కూడా కనుగొన్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఐతే.. పాఠశాలలో ఫైర్ డ్రిల్ జరుగుతుందేమో అనుకున్నామని.. కానీ తర్వాత అవి తుపాకీ చప్పుళ్లని తెలిసి విద్యార్థులంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారని స్కూల్లో పనిచేస్తున్న ఓ టీచర్ చెప్పుకొచ్చారు. అమెరికాలో పెచ్చుమీరుతున్న గన్ కల్చర్తో ఈ మధ్య వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







