పెట్టుబడిదారులకు 100 శాతం యాజమాన్యం ఇవ్వనున్న దుబాయ్ ప్రభుత్వం
- May 21, 2018
దుబాయ్: గల్ఫ్ దేశం యూఏఈలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారితోపాటు ప్రత్యేక నైపుణ్యంతో కలిగి వ్యక్తులకు అక్కడి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 10 సంవత్సరాల వరకూ యూఏఈలో నివసించడానికి అనుమతినిస్తూ వీసాను మంజూరు చేస్తామని ప్రకటించింది. పెట్టుబడిదారులు, నైపుణ్యం కలిగిన వైద్యులు, ఇంజనీర్ల, పరిశోధకులకు ప్రతిపాదిత వీసాలు లభించనున్నాయి. ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులు కూడా యూఏఈ ఉండేందుకు వీసా వెసులుబాటును కల్పించనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా 5 సంవత్సరాల వరకు నివసించే వీసాను మంజూరు చేయనున్నారు. అవసరాన్ని పొడగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని యూఏఈ ఉపాధ్యక్షుడు, దేశ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తుమ్ ఆదివారం ప్రకటించారు.
100 శాతం యాజమాన్యం
యూఏఈలో కంపెనీలు స్థాపించిన యజమానులకు ఆయా కంపెనీలపై 100 శాతం యాజమాన్య హక్కులు లభిస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. యూఏఈ ప్రధాని చేసిన ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తమవుతోంది. పలువురు పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుదారులు వారి కుటుంబ సభ్యులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







