విమాన ప్రయాణీకులకు శుభవార్త
- May 22, 2018ఇండియా:తడిచి మోపెడవుతున్న కాన్సిలేషన్ చార్జీలతో ఇబ్బందులుపడుతున్న విమాన ప్రయాణికులకు విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విమాన టికెట్లను బుక్ చేసుకున్న 24 గంటలలోపు కాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం వెల్లడించారు. కొత్తగా ఎయిర్ సేవా డిజి యాత్రా పథకాన్ని లాంచ్ చేయనున్నట్టు తెలిపారు.
కొన్ని సంస్కరణలపై తాజా ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
- బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో టిక్కెట్లను రద్దు చేసుకుంటే..చార్జి ఉండదు.
- బేస్ ఫేర్ +ఇంధన చార్జీని మించి కాన్సిలేషన్ చార్జీలు ఉండకూడదు.
- ప్రత్యేక అవసరాలతో ప్రయాణించేవారికోసం ప్రత్యేక సదుపాయం.
- విమాన ఆలస్యంలో ఎయిర్లైన్స్ తప్పు ఉంటే విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
- నాలుగు గంటలకు మించి ఆలస్యమైతే పూర్తి ఫీజు వాపసు.
- ఆలస్యం ఒకరోజు దాటితే ప్రయాణికులకు హోటల్లో బస తదితర సౌకర్యాలు కల్పించాలి.
- టికెట్ బుకింగ్నకు ఆధార్ తప్పని కాదు. అయితే డిజీ యాత్రలో నమోదు సమయంలో మాత్రమే ఆధార్ అవసరమవుతుందనీ, డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టామని జయంత్ సిన్హా తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..