నిఫా వైరస్‌: కేరళకు వెళ్ళొద్దని బహ్రెయిన్‌ హెచ్చరిక

- May 23, 2018 , by Maagulf
నిఫా వైరస్‌: కేరళకు వెళ్ళొద్దని బహ్రెయిన్‌ హెచ్చరిక

బహ్రెయిన్‌ జాతీయులు భారతదేశంలోని కేరళకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో భయంకరమైన నిఫా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని బహ్రెయిన్‌ కాన్సులేట్‌ ఈ హెచ్చరికను ట్విట్టర్‌ ద్వారా తమ పౌరులకు చేయడం జరిగింది. సాధారణ ఫ్లూ తరహాలోనే ఈ నిఫా వైరస్‌ సోకినవారిలో లక్షణాలు కన్పిస్తాయి. 10 మంది ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోగా, 9 మంది నిఫా వైరస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. కేరళ పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోనూ నిఫా వైరస్‌కి సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com