మెకును అలర్ట్: బస్ రూట్స్ని రద్దు చేసిన మవసలాత్
- May 23, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్) సైక్లోన్ మెకును కారణంగా ఆరు రూట్లలో బస్సుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మస్కట్ నుంచి దోఫార్, వుస్తా తదితర రూట్లకు బస్సుల్ని రద్దు చేశారు. మే 24 నుంచి ఈ బస్సుల రద్దు అమల్లోకి వస్తుంది. ప్రయాణీకుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మవసలాత్ పేర్కొంది. మస్కట్ - సలాలా, మస్కట్ - మార్ముల్, మస్కట్ - దుక్మ్, సలాలా - మజైయూనా, దుక్మ్ - హైమా మరియు సలాలా - మార్ముల్ మార్గాల్లో బస్సుల్ని మవసలాత్ నిలిపివేస్తుంది. గురువారం ఈ రూట్లలో కేవలం మూడు ట్రిప్స్ మాత్రమే నడుస్తాయి. సైక్లోన్ తీవ్రత తగ్గాక ఈ రూట్లలో బస్సులు యధాతథంగా నడుస్తాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







