మెకును అలర్ట్: బస్ రూట్స్ని రద్దు చేసిన మవసలాత్
- May 23, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్) సైక్లోన్ మెకును కారణంగా ఆరు రూట్లలో బస్సుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మస్కట్ నుంచి దోఫార్, వుస్తా తదితర రూట్లకు బస్సుల్ని రద్దు చేశారు. మే 24 నుంచి ఈ బస్సుల రద్దు అమల్లోకి వస్తుంది. ప్రయాణీకుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మవసలాత్ పేర్కొంది. మస్కట్ - సలాలా, మస్కట్ - మార్ముల్, మస్కట్ - దుక్మ్, సలాలా - మజైయూనా, దుక్మ్ - హైమా మరియు సలాలా - మార్ముల్ మార్గాల్లో బస్సుల్ని మవసలాత్ నిలిపివేస్తుంది. గురువారం ఈ రూట్లలో కేవలం మూడు ట్రిప్స్ మాత్రమే నడుస్తాయి. సైక్లోన్ తీవ్రత తగ్గాక ఈ రూట్లలో బస్సులు యధాతథంగా నడుస్తాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









