4వ ఐబీపీఎస్‌ఏ అంతర్జాతీయ సదస్సు..

- December 08, 2015 , by Maagulf
4వ ఐబీపీఎస్‌ఏ అంతర్జాతీయ సదస్సు..

ఐఐఐటీ హైదరాబాద్‌లో 14వ ఐబీపీఎస్‌ఏ అంతర్జాతీయ సదస్సు 'బిల్డింగ్‌ సిమ్యులేషన్‌ -2015' పేరిట ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భవన నిర్మాణంలో, వాటి శక్తి సామర్థ్యాల పెంపుపై అవలంభించాల్సిన అధునాతన పద్దతులపై సుదీర్ఘంగా చర్చించారు. భవనాల శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో సిమ్యులేషన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐఐఐటీ హైదరాబాద్‌లోని హెడ్‌ ఆఫ్‌ సెంటర్‌ ఫర్‌ ఐటీ ఇన్‌ బిల్డింగ్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ విశాల్‌ గార్గ్‌ అన్నారు. వచ్చే 15 సంవత్సరాలలో భవన నిర్మాణాలు ఎక్కువగా జరుగుతాయని.. ప్రస్తుతం ఈ సదస్సుకు హాజరైన నిపుణులు భారత్‌కు చెందిన పరిశోధకులకు చక్కటి అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సీఐఐ తెలంగాణ ఛైర్‌పర్సన్‌ వనితా దాట్ల తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు 40 దేశాలకు చెందిన 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com