ఐఐఐటీ హైదరాబాద్లో 14వ ఐబీపీఎస్ఏ అంతర్జాతీయ సదస్సు 'బిల్డింగ్ సిమ్యులేషన్ -2015' పేరిట ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భవన నిర్మాణంలో, వాటి శక్తి సామర్థ్యాల పెంపుపై అవలంభించాల్సిన అధునాతన పద్దతులపై సుదీర్ఘంగా చర్చించారు. భవనాల శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో సిమ్యులేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐఐఐటీ హైదరాబాద్లోని హెడ్ ఆఫ్ సెంటర్ ఫర్ ఐటీ ఇన్ బిల్డింగ్ సైన్స్ ప్రొఫెసర్ విశాల్ గార్గ్ అన్నారు. వచ్చే 15 సంవత్సరాలలో భవన నిర్మాణాలు ఎక్కువగా జరుగుతాయని.. ప్రస్తుతం ఈ సదస్సుకు హాజరైన నిపుణులు భారత్కు చెందిన పరిశోధకులకు చక్కటి అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఐఐ తెలంగాణ ఛైర్పర్సన్ వనితా దాట్ల తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ సదస్సుకు 40 దేశాలకు చెందిన 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
4వ ఐబీపీఎస్ఏ అంతర్జాతీయ సదస్సు..
- December 08, 2015తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







