ఐఐఐటీ హైదరాబాద్లో 14వ ఐబీపీఎస్ఏ అంతర్జాతీయ సదస్సు 'బిల్డింగ్ సిమ్యులేషన్ -2015' పేరిట ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భవన నిర్మాణంలో, వాటి శక్తి సామర్థ్యాల పెంపుపై అవలంభించాల్సిన అధునాతన పద్దతులపై సుదీర్ఘంగా చర్చించారు. భవనాల శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో సిమ్యులేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐఐఐటీ హైదరాబాద్లోని హెడ్ ఆఫ్ సెంటర్ ఫర్ ఐటీ ఇన్ బిల్డింగ్ సైన్స్ ప్రొఫెసర్ విశాల్ గార్గ్ అన్నారు. వచ్చే 15 సంవత్సరాలలో భవన నిర్మాణాలు ఎక్కువగా జరుగుతాయని.. ప్రస్తుతం ఈ సదస్సుకు హాజరైన నిపుణులు భారత్కు చెందిన పరిశోధకులకు చక్కటి అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఐఐ తెలంగాణ ఛైర్పర్సన్ వనితా దాట్ల తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ సదస్సుకు 40 దేశాలకు చెందిన 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
4వ ఐబీపీఎస్ఏ అంతర్జాతీయ సదస్సు..
- December 08, 2015తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









