జనవరి 1 నుంచి 2 మిలియన్ వీసాలు
- December 08, 2015
దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) 59 మిలియన్ లావాదేవీల్ని 2015 ప్రారంభం నుంచి నిర్వహించింది. 12 మిలియన్ వీసాలు ఈ కాలంలో జారీ చేసింది. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, 42 మిలియన్ ప్రయాణీకులు దుబాయ్ బోర్డర్స్ ద్వారా జనవరి 1 నుంచి నవంబర్ వరకూ ప్రయాణించినట్లు చెప్పారు. మేజర్ జనరల్ అల్ మర్రి ఇంకా మాట్లాడుతూ, అథారిటీ ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టిందనీ, పనితీరు సామర్థ్యం పెంపుతోపాటు, మహిళా వర్కర్ల కోసం పని వేళల్ని వీలుగా మార్చడం జరిగిందని చెప్పారు. పని ప్రాంతాల్లో ప్రమాదాల గురించీ, ఇతర ఇబ్బందుల గురించి అవగాహన పెంచడం ద్వారా ఉద్యోగార్థులకు సహాయపడ్డామని డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ ఒబైద్ మొహైర్ బిన్ సురూర్ అన్నారు. యూఎస్ బేస్డ్ రిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ రూత్ మాట్లాడుతూ, మిడిల్ ఈస్ట్లో ఈ తరహా కాన్ఫ్రెన్స్ని తొలిసారిగా నిర్వహించినట్లు చెప్పారు. రెండు రోజుల పాటు మిడిల్ ఈస్ట్లోని ఇన్స్యూరెన్స్ మార్కెట్పై జరిగిన ఎడ్యుకేఏషన్ మరియు నెట్వర్కింగ్ కాన్ఫరెన్స్లో హాజరైన ఔత్సాహికులకు రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రేటజీస్ పట్ల అవగాహన కలగజేశామన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









