చెర్రీ, తారక్ల మల్టీస్టారర్ సినిమాపై ఆసక్తికర కథనం!
- June 01, 2018
తారక్, చెర్రీలతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీపై రోజుకో వార్త చక్కర్లుకొడుతుంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే అభిమానుల్లో సినిమా సందడి మొదలైపోయింది. రూ.300 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అధికారికంగా రాజమౌళి ఈ మూవీ స్టోరీ గురించి సింగల్ లైన్ కూడ చెప్పకముందే ఈ సినిమా కథకు సంబందించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ మూవీలో చెర్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఆయన సోదరుడిగా తారక్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారంటూ టాలీవుడ్ టాక్. అంతేగాక ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్గా ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్తలన్నీ నిజమో కాదో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









