వాల్నట్స్ తీసుకుంటే మగవారికి మంచిది...
- June 02, 2018
గింజలు తినడం వలన పలు అనారోగ్యాలు దూరమవుతాయి. శరీరానికి కావలసిన కీలక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. నట్స్ను 10 గ్రాముల మోతాదులో తినడం వలన ఒక రోజుకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి. అయితే ఒకే రకమైన నట్స్ను కాకుండా 3, 4 రకాలను 10 గ్రాముల మోతాదులో తీసుకోవాలి.
వాల్నట్స్ రోజు తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె వ్యాధులు దూరమవుతాయి. అదేవిధంగా ఎముకలు దృఢత్వం పొందుతాయి. శరీర మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. డయోబెటిస్ ఉంటే అదుపులోకి వస్తుంది. గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. మగవారిలో అయితే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది. ఆడవారిలో రుతు సమస్యలు తొలగిపోతాయి.
బాదం పప్పు తినడం వల్ల శరీరరోగనిరోధక శక్తి పెరుగుతుంది. పలురకాల ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. పురుషుల్లో ఉండే వ్యంధ్యత్వ సమస్యలు పోతాయి. సంతానం కలిగేందుకు ఉపయోగపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. తక్కువ మెుత్తంలో తిన్నా కడుపు ఫుల్గా ఉంటుంది.
వేరుశెనగలు నిత్యం పలు వంటకాల్లోనూ, చట్నీల్లోనూ వాడుతుంటారు. వీటిని నట్స్ రూపంలో రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఇ ఉండడం వలన శరీరానికి సామర్థ్యం పెరుగుతుంది.
పిస్తా పప్పును గుండె సమస్యలు రావు. బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. పొడి చర్మం ఉన్నవారు తింటే వారి చర్మం మృదువుగా మారుతుంది. పీచు ఉండడం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శరీరరోగనిరోధక వ్యవస్థ పటిష్ఠమవుతుంది. డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది.
జీడిపప్పును రోజు తినడం వలన శరీరానికి చాలా మంచిది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత పోతుంది. శరీరరోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. కంటి సమస్యలు రావు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు







