ఖుబానీ కా మీఠా
- June 02, 2018
కావలసిన పదార్థాలు : ఎండు ఖుబానీ పండ్లు(ఎండు ఆప్రికాట్స్)-అర కిలో, పంచదార-250గ్రా, క్రీమ్-100గ్రా, నీళ్లు-ఒక లీటరు.
తయారుచేసే విధానం : ముందుగా ఖుబానీ పండ్లను శుభ్రంగా కడిగి వాటిని ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసి స్టవ్పై ఉంచి ఉడికించాలి. ఉడికాక దించి 3-4 గంటలు చల్లార్చాలి. వాటిలోని గింజలను తీసి పక్కన ప్లేటులో ఉంచుకుని, ఖుబానీ పండ్లలో పంచదార వేసి స్టవ్పై ఉంచాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఖుబానీ పండ్ల గుజ్జు బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచి దించేయాలి. ఇప్పుడు ఖుబానీ పండ్ల గింజలను పగలగొట్టి మధ్యలో ఉండే పప్పును తీసి గంట సేపు నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిపై ఉండే పొరను వలిచేయాలి. వీటిని ఖుబానీ గుజ్జులో కలపాలి. తినే ముందు ఖుబానీ కా మీఠాను బౌల్లోకి తీసుకుని పైన పాల క్రీమ్గాని లేదంటే వెనీలా ఐస్క్రీంగాని వేసి, పుదీన ఆకులు, చెర్రీతో అలంకరించాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







