పాక్ నుంచి డ్రోన్ సాయంతో భారత్‌లోకి డ్రగ్స్ సరఫరా

- June 06, 2018 , by Maagulf
పాక్ నుంచి డ్రోన్ సాయంతో భారత్‌లోకి డ్రగ్స్ సరఫరా

పాకిస్థాన్‌ డ్రగ్స్‌ మాఫియా సరకును సరిహద్దులు దాటించడానికి డ్రోన్ల సాయం తీసుకుంటోంది. డ్రోన్ల సాయంతో హెరాయిన్‌ వంటి మత్తు పదార్థాలను పంజాబ్‌ సరిహద్దుల్లోని గ్రామాలకు తరలిస్తోంది. తాజాగా గురుదాస్‌పూర్‌ గ్రామంలోకి డ్రోన్‌ సాయంతో మాదక ద్రవ్యాలను పంపినట్లు బీఎస్‌ఎఫ్‌ నిఘా విభాగం గుర్తించింది. ఓ ప్లాస్టిక్‌ సంచీలో ప్యాక్‌ చేసిన డ్రగ్స్‌తో కూడిన డ్రోన్‌ను 200 మీటర్ల ఎత్తులో గుర్తించి సైన్యం అప్రమత్తమైంది. ఈ విషయాన్ని పసిగట్టిన డ్రోన్ మాదకద్రవ్యాలను డెలివరీ చేయకుండానే పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com