దుబాయ్ స్కూల్స్ ఫీజుల్లో పెంపు లేదు: షేక్ హందాన్
- June 06, 2018
దుబాయ్:ఈ ఏడాది దుబాయ్ స్కూల్స్లో ఫీజుల పెంపు లేదని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. ట్విట్టర్లో ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో, స్కూల్ ఫీజులను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారాయన. దుబాయ్లోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఈ ఆదేశాన్ని పాటించాల్సి వుంటుంది. ఫీజుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని షేక్ హమదాన్ వివరించారు. దుబాయ్లో పలు స్కూల్స్ భారీగా ఫీజుల్ని వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూల్స్ ఒక్కో విద్యార్థి నుంచి 100,000 దిర్హామ్లను వసూలు చేస్తున్నాయి. పుస్తకాలు కాకుండా తమకు 23,000 దిర్హామ్ల ఖర్చవుతోందంటూ ఇద్దరు పిల్లల తల్లి అర్చినా దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు పెంచకూడదన్న పాలకుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







