దుబాయ్ స్కూల్స్ ఫీజుల్లో పెంపు లేదు: షేక్ హందాన్
- June 06, 2018
దుబాయ్:ఈ ఏడాది దుబాయ్ స్కూల్స్లో ఫీజుల పెంపు లేదని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. ట్విట్టర్లో ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో, స్కూల్ ఫీజులను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారాయన. దుబాయ్లోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఈ ఆదేశాన్ని పాటించాల్సి వుంటుంది. ఫీజుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని షేక్ హమదాన్ వివరించారు. దుబాయ్లో పలు స్కూల్స్ భారీగా ఫీజుల్ని వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూల్స్ ఒక్కో విద్యార్థి నుంచి 100,000 దిర్హామ్లను వసూలు చేస్తున్నాయి. పుస్తకాలు కాకుండా తమకు 23,000 దిర్హామ్ల ఖర్చవుతోందంటూ ఇద్దరు పిల్లల తల్లి అర్చినా దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు పెంచకూడదన్న పాలకుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







