మస్కట్:వాటర్ బాటిల్స్లో బ్యాక్టీరియా, అల్గాయ్
- June 08, 2018
మస్కట్: అనారోగ్యకరమైన పరిస్థితుల్లో వున్న వాటర్ బాటిల్స్ని విక్రయిస్తున్న కారణంగా ఓ కంపెనీకి 600 ఒమన్ రియాల్స్ జరీమానా విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. ఓ వినియోగదారుడి ఫిర్యాదు మేరకు పిఎసిపి అధికారులు తనిఖీలు నిర్వహించగా, తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. వాటర్ బాటిల్స్లోని నీటిలో బ్యాక్టీరియా, అల్గాయ్ కన్పించాయి. ఈ బాటిల్స్లో నీరు తాగితే అనారోగ్యం పాలవడం ఖాయమని అధికారులు పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్కి జరీమానా విధించడమే కాక, హెచ్చరికలు కూడా జారీ చేశామని అధికారులు తెలిపారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేలా, వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా డిస్ట్రిబ్యూటర్స్, విక్రయదారులు వ్యవహరించరాదని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







