తెలంగాణ:కిడ్నీబాధితుడికి ఆర్థిక సహాయం చేసిన 'గల్ఫ్ ఎన్.ఆర్.ఐ ఫ్రెండ్స్'
- June 08, 2018
తెలంగాణ:ముస్తాబాద్ మండలం అవునురా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గంగిరెడ్డి మహేందర్ రెడ్డి సునీత దంపతుల కుమారుడు వెంకటేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని గల్ఫ్ ఎన్.ఆర్.ఐ మిత్ర ఫ్రెండ్స్ కుటుంబాల మహేందర్,జనగామ నివాస్,పురుషోత్తం,కరుణాకర్ ,సాయి రాంచందర్ బృందంతో 35 వేల ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా జనగామ శ్రీనివాస్ మాట్లాడుతూ పొట్టచేతపట్టుకుని మహేందర్ రెడ్డి 7 వేల జీతంతో కూలి పని చేసుకుంటూ గల్ఫ్ లో జీవనం సాగిస్తున్న సమయంలో తన కొడుకుకు రెండు కిడ్నీలు ఫేలవడంతో తన భార్య సునీత ఒక కిడ్నీ దానం చేయడం జరిగిందని ఆపరేషన్ ఫేల్ కావడం వల్ల ఆ కుటుంబం రోడ్డునపడిందని ఈ కుటుంబాన్ని మానవదృక్పదంతో ఆలోచించి ప్రజాప్రతినిధులు గాని,ఎన్.ఆర్.ఐ మిత్రులుగాని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.అప్పులలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







