తెలంగాణ:కిడ్నీబాధితుడికి ఆర్థిక సహాయం చేసిన 'గల్ఫ్ ఎన్.ఆర్.ఐ ఫ్రెండ్స్'
- June 08, 2018
తెలంగాణ:ముస్తాబాద్ మండలం అవునురా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గంగిరెడ్డి మహేందర్ రెడ్డి సునీత దంపతుల కుమారుడు వెంకటేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని గల్ఫ్ ఎన్.ఆర్.ఐ మిత్ర ఫ్రెండ్స్ కుటుంబాల మహేందర్,జనగామ నివాస్,పురుషోత్తం,కరుణాకర్ ,సాయి రాంచందర్ బృందంతో 35 వేల ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా జనగామ శ్రీనివాస్ మాట్లాడుతూ పొట్టచేతపట్టుకుని మహేందర్ రెడ్డి 7 వేల జీతంతో కూలి పని చేసుకుంటూ గల్ఫ్ లో జీవనం సాగిస్తున్న సమయంలో తన కొడుకుకు రెండు కిడ్నీలు ఫేలవడంతో తన భార్య సునీత ఒక కిడ్నీ దానం చేయడం జరిగిందని ఆపరేషన్ ఫేల్ కావడం వల్ల ఆ కుటుంబం రోడ్డునపడిందని ఈ కుటుంబాన్ని మానవదృక్పదంతో ఆలోచించి ప్రజాప్రతినిధులు గాని,ఎన్.ఆర్.ఐ మిత్రులుగాని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.అప్పులలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









