చైనాకు బయలు దేరిన నరేంద్ర మోడీ

- June 08, 2018 , by Maagulf
చైనాకు బయలు దేరిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : చైనాలోని క్వింగ్డావోలో రెండు రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) సమావేశాల్లో పాల్గనేందుకు నరేంద్రమోడీ శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఆరు వారాల మోడీ చైైనాకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ సహకార సంస్థను విస్తరించిన తర్వాత ఏర్పాటవుతున్న తొలి సమావేశాల్లో అక్కడాయన పాల్గంటారు. గత ఏడాది కజకిస్థాన్‌ లో జరిగిన ఆస్తానా సమ్మిట్‌లో భారత్‌, పాకిస్థాన్‌లకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. శాశ్వత సభ్యత్వం లభించిన తర్వాత ఈ సమావేశాల్లో పాల్గంటున్న తొలి భారత ప్రధాని మోడీనే. ఉగ్రవాదంపై పోరాటం, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో మోడీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మధ్యాహ్నం 1.20 గంటలకు మోడీ క్వింగ్డావో చేరుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com