చైనాకు బయలు దేరిన నరేంద్ర మోడీ
- June 08, 2018
న్యూఢిల్లీ : చైనాలోని క్వింగ్డావోలో రెండు రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) సమావేశాల్లో పాల్గనేందుకు నరేంద్రమోడీ శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఆరు వారాల మోడీ చైైనాకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ సహకార సంస్థను విస్తరించిన తర్వాత ఏర్పాటవుతున్న తొలి సమావేశాల్లో అక్కడాయన పాల్గంటారు. గత ఏడాది కజకిస్థాన్ లో జరిగిన ఆస్తానా సమ్మిట్లో భారత్, పాకిస్థాన్లకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. శాశ్వత సభ్యత్వం లభించిన తర్వాత ఈ సమావేశాల్లో పాల్గంటున్న తొలి భారత ప్రధాని మోడీనే. ఉగ్రవాదంపై పోరాటం, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో మోడీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మధ్యాహ్నం 1.20 గంటలకు మోడీ క్వింగ్డావో చేరుకుంటారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..