అమెరికా:తెలుగువారు నివాసముంటున్న భవనంలో అగ్నిప్రమాదం
- June 10, 2018అమెరికాలోని మేరిల్యాండ్ లో తెలుగువారు నివాసముంటున్న భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. పూర్తిగా కలపతో కట్టిన మూడంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉంటున్న 15 కుటుంబాలకు చెందిన వారు భయంతో కిందకు పరుగులుతీశారు. అయితే ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. వెంటనే సంఘటనా స్థలానికిచేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే పై రెండు అంతస్థులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ భవనంలో 5 తెలుగు కుటుంబాల వారు నివాసముంటున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న తానా సభ్యులు బాధితులకు తమ వంతు సహాయ అందించారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…