సౌదీ అరేబియా:హౌతీ తిరుగుబాటుదారుల వైమానిక దాడి
- June 10, 2018
రియాద్ : సౌదీ అరేబియాలో హౌతీ తిరుగుబాటుదారులు వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సౌదీ మిలిటరీ అధికార ప్రతినిధి అల్ మాలికీ తెలిపిన వివరాల ప్రకారం...యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ సరిహద్దు ప్రాంతంలో వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు. వైమానిక దాడితో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. కాగా, హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతిస్తోంది. ఈనేపథ్యంలో తిరుగుబాటుదారులు ఇరాన్ సహకారంతో సౌదీపై దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యెమెన్లో 2015లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 10వేల మంది చనిపోయారు. ప్రాణభయంతో దాదాపు 30లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







