సౌదీ అరేబియా:హౌతీ తిరుగుబాటుదారుల వైమానిక దాడి
- June 10, 2018రియాద్ : సౌదీ అరేబియాలో హౌతీ తిరుగుబాటుదారులు వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సౌదీ మిలిటరీ అధికార ప్రతినిధి అల్ మాలికీ తెలిపిన వివరాల ప్రకారం...యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ సరిహద్దు ప్రాంతంలో వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు. వైమానిక దాడితో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. కాగా, హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతిస్తోంది. ఈనేపథ్యంలో తిరుగుబాటుదారులు ఇరాన్ సహకారంతో సౌదీపై దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యెమెన్లో 2015లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 10వేల మంది చనిపోయారు. ప్రాణభయంతో దాదాపు 30లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..