హోటల్స్, రెస్టారెంట్స్ ఫీజుల్ని తగ్గించిన దుబాయ్
- June 11, 2018
దుబాయ్ని మరింత ఫ్రెండ్లీ ఇన్వెస్టిమెంట్ డెస్టినేషన్గా మార్చేందుకోసం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తౌమ్ మునిసిపాలిటీ ఫీజుల తగ్గింపుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం రెస్టారెంట్లు, హోటల్స్కి సంబంధించి సేల్స్ ఫీజ్ని 10 నుంచి 7 శాతం తగ్గనుంది. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పాలసీ ప్రకారం, దుబాయ్లో పోటీతత్వాన్ని ఆయా రంగాల్లో పెంచేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు షేక్ హమదాన్ చెప్పారు. దుబాయ్ని ప్రతి ఒక్కరూ బిజినెస్ డెస్టినేషన్లో మార్చుకోవాలనీ, అందుకు తగ్గ విధంగా పలు ఆకర్షణీయమైన నిర్ణయాలు ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తూనే వుంటాయని ఆయన వివరించారు. టూరిజం, హోటల్ సెక్టార్లో పెట్టుబడులకు ఎప్పుడూ అవకాశాలు వుంటాయనీ, ఈ విభాగంలో వృద్ధిని వీలైనంత ఎక్కువగా నమోదు చేయడమే తలక్ష్యమని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







