మల్టీస్టారర్ సినిమా చేయనున్న కళ్యాణ్ రామ్.!

- June 13, 2018 , by Maagulf
మల్టీస్టారర్ సినిమా చేయనున్న కళ్యాణ్ రామ్.!

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నా నువ్వే సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జయంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ కు జోడిగా తమన్నా నటించడం జరిగింది. రొమాంటిక్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కథతో రాబోతున్నాడు. పవన్ సాతినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ తో పాటు మరో హీరో నటించనున్నాడు. ప్రస్తుతం ముగ్గురు , నలుగుర్ని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. వారిలో ఒకర్ని ఎంపిక చేస్తారట.

దీని ఫై త్వరలోనే ఓ ప్రకటన రాబోతుందని కళ్యాణ్ రామ్ తాజా ఇంటర్వ్యూ లో అభిమానులకు తెలిపాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com