గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- January 18, 2026
హైదరాబాద్: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ను ఏర్పాటు చేసిన గ్రీన్ కో సంస్థపై లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. గ్రీన్ కో సంస్థకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ ప్రాజెక్ట్ వివరాలను ఆయన ప్రస్తావిస్తూ, "1950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యంతో, 1.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్.. భారతదేశ ఇంధన రంగ పరివర్తనలో, అధిక విలువైన రసాయనాల ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది" అని పేర్కొన్నారు.ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన, భారీ ప్రాజెక్టులే దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగలవని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు









