చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- January 18, 2026
చైనాలోని ఓ స్కూలులో వైరస్ కలకలం రేగింది. వంద మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వైద్యాధికారులు రంగంలోకి దిగి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 103 మంది విద్యార్థులకు ‘నోరా వైరస్’ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. క్లాస్ రూమ్ లతో పాటు స్కూలు ఆవరణలో వైరస్ ను నాశనం చేసే మందును చల్లారు. వైరస్ బాధిత విద్యార్థులకు చికిత్స అందజేస్తూనే మిగతా విద్యార్థులకు వైరస్ సోకకుండా చర్యలు చేపట్టారు.బాధిత విద్యార్థులు అందరూ కోలుకుంటున్నారని వివరించారు. రోజూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ప్రత్యేక హాజరు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్కూలు పరిసరాల్లోని నివాస సముదాయాల్లో ఉంటున్న వారికి వైరస్ పరీక్షలు చేపట్టినట్లు వివరించారు. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ డిసీజ్ కంట్రోల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఏటా అక్టోబర్ నుంచి మార్చి మధ్య ప్రావిన్స్ లో నోరో వైరస్ విజృంభిస్తుందని అధికారులు తెలిపారు. వైరస్ బాధితులు ప్రధానంగా వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటారని చెప్పారు. ఈ వైరస్ సాధారణమైందేనని, వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని వివరించారు. ఈ వైరస్ ను తొలిసారి 1968 లో అమెరికాలోని ఓహియో రాష్ట్రం నార్ వాక్ లోని ఓ స్కూలులో గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ ను నోరో వైరస్ గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







