ఫుట్బాల్ ప్రియుల్ని ఉర్రూతలూగించే 'FIFA' ప్రపంచకప్..
- June 13, 2018
ఆ టోర్నీ వస్తే.. ఐరోపా వెర్రెత్తి పోతుంది. అమెరికా ఊగిపోతుంది. ఆసియా అదిరిపోతుంది. ఆఫ్రికా మైమరిచి పోతుంది. ఆ దేశం.. ఈ దేశం అని తేడాలుండవు. ఎవరి జట్టు ఉన్నా లేకున్నా.. అందరూ ఆ టోర్నీకి అభిమానులే. అది అసలు సిసలైన సాకర్ ప్రపంచకప్. వందల కోట్ల మందిని టీవీల ముందు కూర్చోబెట్టే అద్భుత పోరాటాలకు వేదికగా నిలిచే ఫిఫా వరల్డ్కప్కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది.
ఆట తెలియని వాడు కూడా ఒకసారి అటు ఒక చూపు వేస్తే.. కళ్లు తిప్పుకోవడం కష్టమే.. 90 నిమిషాలు బంతి చుట్టూ ఆటగాళ్లే కాదు.. ఆట చూసే వాళ్లూ తిరగాల్సిందే. అంతలా ఉర్రూతలూగించే ఆ బంతి.. మళ్ళీ వరల్డ్కప్తో వచ్చేసింది.
నాలుగేళ్లకోసారి ప్రపంచ ఫుట్బాల్ ప్రియుల్ని ఉర్రూతలూగించే సాకర్ ప్రపంచకప్ ఇవాళే మొదలుకానుంది. రష్యా వేదికగా ఈ ఏడాది ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. నెల రోజుల పాటు అభిమానులను అలరించనున్న ఈ సాకర్ సంబరంలో 32 జట్లు 8 గ్రూపులుగా విడిపోయి హోరాహోరీగా తలపడనున్నాయి. మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు పెద్ద సంఖ్యలో రష్యాకు చేరుకున్నారు. మొత్తం 11 నగరాల్లో 12 వేదికలు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుండగా... ఒక్కో స్టేడియాన్ని ఒక్కో మోడల్లో డిజైన్ చేయడం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.
వేలాది మంది అభిమానులతో రష్యాలో ఎటు చూసినా ఫుట్బాల్ ఫీవర్ పీక్ స్టేజ్లో కనిపిస్తోంది. ఒకవైపు జట్లన్నీ ప్రాక్టీస్లో బిజీబిజీగా గడుపుతుంటే...మరోవైపు తమ అభిమాన ఆటగాళ్ళ విన్యాసాలు చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోయారు.
అయితే టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశాలున్న నేపథ్యంలో టోర్నీకి అత్యున్నత భద్రతను ఏర్పాటు చేశారు. ప్రపంచకప్కు వస్తున్న అభిమానుల నేపథ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. మ్యాచ్ల చూసేందుకు వచ్చే వివిధ దేశాల అభిమానులు 12 ఆతిథ్య నగరాల్లో ఎక్కడో ఒక చోట పోలీసుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్న నిబంధనను అమలు చేస్తోంది. గత ఎనిమిదేళ్ళ కాలంలో ఇక్కడ జరిగిన దాడుల కారణంగానే రష్యా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే తమ ఆటతో సాకర్ ప్రపంచాన్ని ఊపేసే మెస్సీ, నెయ్మార్,రొనాల్డినో వంటి స్టార్ ప్లేయర్స్ విన్యాసాలతో మరో నెలరోజులు అభిమానులకు పండుగే.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







