జిసిసి రైల్ ప్రాజెక్ట్ కోసం ప్రైవేట్ సెక్టార్ని
- December 10, 2015
జిసిసి రీజియన్లో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్ట్ అయిన రైల్ నెట్వర్క్ కోసం ప్రైవేటు సెక్టార్ని ఆశ్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌదీ రైల్ అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి చెందిన ఆరు దేశాలు ప్రాజెక్ట్ రెండో దశకు సంబంధించి డిజైన్ బిడ్స్ని విడుదల చేశాయి. సౌదీ రైల్వేస్ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ) ప్రెసిడెంట్ మహమ్మద్ ఖలీద్ అల్ సువాఐకత్ మాట్లాడుతూ, కువైట్ బోర్డర్లోని సౌదిఅల్ ఖఫ్జి టౌన్ బోర్డనని ఈస్ట్ సౌద్ అరేబియాలోని అల్ హోఫుఫ్ మరియు యూఏఈ బోర్డర్లోని అల్ బట్నాని కలిపేలా రైల్ లింక్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆరు దేశాలు ప్రైవేట్ సెక్టార్ని ఈ ప్రాజెక్ట్లో భాగం చేయాలనుకుంటున్నాయనీ, అయితే ఇంకా ఇది చర్చల దశలోనే ఉందని వెల్లడించాయి. 2018 నాటికి పూర్తి చేయాలనుకుంటున్న 2117 కిలోమీటర్ల రైల్ లింక్ కోసం 15 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







