దొంగిలించిన క్రెడిట్ కార్డ్స్తో టిక్కెట్ అమ్మకాలు
- December 10, 2015
ఖతారీ పౌరులకు చెందిన క్రెడిట్ కార్డ్స్ని దొంగిలించి, వాటితో ఎయిర్ టిక్కెట్లను బుక్ చేసి అమ్ముకుంటోన్న అరబ్ జాతీయుడ్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి), ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్పోల్) సహాయంతో అరెస్ట్ చేశారు. ఖతార్ ఎయిర్ వేస్ నుంచి అందుకున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగి, వ్యూహాత్మకంగా ఆ నిందితుడ్ని అరెస్టు చేసినట్లు సిఐడి అధికారులు వెల్లడించారు. అరబ్ జాతీయులు కొందరు, విదేశాల్లో నివసిస్తూ, తక్కువ ధరకే ఎయిర్ టిక్కెట్లు అంటూ ఆఫర్ చేస్తున్నారనీ, సోషల్ మీడియా ద్వారా ఇదంతా జరుగుతోందని తెలిపారు. టిక్కెట్లను అధీకృతులైన విక్రేత కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాలని సిఐడి అధికారులు పౌరులకు సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







