జిసిసి సమ్మిట్లో కీలక చర్చలు
- December 10, 2015
గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ (జిసిసి) యాన్యువల్ సమ్మిట్లో కీలక చర్చలు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని పెంపొందించే దిశగా తీసుకోవాల్సిన చర్చలపై ఈ సమ్మిట్లో జిసిసి ముఖ్య నాయకులు చర్చలు జరిపారు. ఇంధన ధరల పతనం, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు నేతలు. అలాగే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కి మద్దతుగా నిలవాలని తీర్మానించారు. గల్ఫ్ మిలిటరీ ఫోర్సెస్ ఎమెన్లో ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న తీవ్రవాదులతో పోరాడుతున్న వైనం కూడా చర్చకు వచ్చింది. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గల్ఫ్ దేశాలు ఉపేక్షించరాదని ఈ సమావేశంలో తీర్మానించారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌది అరేబియా మరియు యూఏఈ ప్రతినిథులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సౌదీ రాజధానిలో జరుగుతున్న ఈ సమావేశాలు గల్ఫ్ దేశాలను అభివృద్ధి పథంలో, ఏకతాటిపై నడిపిస్తాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







