ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ తప్పనిసరి
- December 10, 2015అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని మరియు ఫైనాన్స్ మినిస్టర్ అలీ షరీఫ్ అల్ ఇమాది చెప్పారు. ఇంధన ధరల పతనం 60 శాతానికి పైగా ఉందని, ఈ పరిస్థితుల్లో నెగెటివ్ ఇంపాక్ట్ని తగ్గించి, పాజిటివ్ యాటిట్యూడ్తో అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. యూరోమనీ కాన్ఫరెన్స్ ఖతార్ 2015లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధనేతర రంగాల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించవలసి ఉందనీ, కన్స్ట్రక్షన్, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులను రాబడితే దేశ ఆర్థిక రంగం మరింత స్థిరంగా, బలంగా ఉంటుందని ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా చెప్పారు. ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ ఖతార్ స్థిరంగా అభివృద్ధి కొనసాగిస్తోందని ఆయన అన్నారు. 2022 ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులేవీ కనిపించకుండా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు షేక్ అబ్దుల్లా.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు