ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ తప్పనిసరి
- December 10, 2015
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని మరియు ఫైనాన్స్ మినిస్టర్ అలీ షరీఫ్ అల్ ఇమాది చెప్పారు. ఇంధన ధరల పతనం 60 శాతానికి పైగా ఉందని, ఈ పరిస్థితుల్లో నెగెటివ్ ఇంపాక్ట్ని తగ్గించి, పాజిటివ్ యాటిట్యూడ్తో అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. యూరోమనీ కాన్ఫరెన్స్ ఖతార్ 2015లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధనేతర రంగాల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించవలసి ఉందనీ, కన్స్ట్రక్షన్, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులను రాబడితే దేశ ఆర్థిక రంగం మరింత స్థిరంగా, బలంగా ఉంటుందని ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా చెప్పారు. ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ ఖతార్ స్థిరంగా అభివృద్ధి కొనసాగిస్తోందని ఆయన అన్నారు. 2022 ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులేవీ కనిపించకుండా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు షేక్ అబ్దుల్లా.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







