తెలంగాణ:విదేశాల్లో విద్య కోసం దరఖాస్తుల స్వీకరణ
- June 21, 2018
హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఇండో అమెరికన్ స్టడీస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంజినీరింగ్, ఆర్ట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇతర మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఏడాది కాలంలోనే ఈ కోర్సులను పూర్తి చేయడంతోపాటు స్కాలర్షిప్ పొందవచ్చని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేషన్ , మెడిసిన్, ఇంజినీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులకు ఇంటర్, డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ నుంచి అమెరికాకు ఉన్నత విద్యనభ్య సించడానికి వెళ్లే విద్యార్థులకు వసతి, వీసా, ఫీజు ఇతరత్ర వాటికి అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. వివరాల కోసం 9246522065, [email protected]లో సంప్రదించాలని ఉషశ్రీ సూచించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







