ఇండిగో ఛార్జీల మోత
- June 23, 2018
చౌక ధర విమానయాన సంస్థ ఇండిగో అదనపు లగేజీ ఛార్జీలను భారీగా పెంచింది. 15 కేజీలు దాటిన అదనపు లగేజీపై ఏకంగా 33 ఛార్జీని పెంచుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. ప్రి బుకింగ్ చేసుకున్న వారికి ప్రస్తుతం 5 కేజీలపై రూ.1900, 10 కేజీల పై రూ.3800, 15 కిలోలపై రూ.5700, 30 కిలోలపై రూ.11,400 ఛార్జీని వసూలు చేస్తోంది ఇండిగో. అయితే ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకోకుండా 15 కేజీలకు అదనంగా లగేజీని కలిగి ఉంటే ప్రస్తుతం కేజీకి రూ.400 వసూలు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో నిర్ణీత లగేజీ పరిమితి దాటితే విమానయాన సంస్థలు తమకు నచ్చిన రీతిలో ఛార్జీలను వసూలు చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అదనపు లగేజీపై ఛార్జీలను పెంచుతున్నట్లు ఇండిగో వెల్లడించింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!