ఆర్మీ మేజర్ భార్య గొంతుకోసి.. శరీరం మీదనుంచి వాహనం పోనిచ్చి..
- June 23, 2018
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఆర్మీ మేజర్ భార్యను గొంతుకోసి ఆపై వాహనాన్ని శరీరం మీదుగా పోనిచ్చారు. ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ వద్ద శనివారం ఓ మహిళ యాక్సిడెంట్లో గురైంది. అయితే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె గొంతు కోసి ఉండటాన్ని గమనించి.కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళ కొద్ది గంటలక్రితం మిస్ అయిన ఆర్మీ మేజర్ భార్యగా గుర్తించారు.
హత్యకు గురవకముందు 30 ఏళ్ల మహిళ స్థానికంగా ఉన్న ఫిజియోథెరపీ సెంటర్ కు వెళ్లారు. ఆమె భర్త మేజర్ కావటంతో అధికారిక వాహనంలో ఆమెను డ్రైవర్ ఆస్పత్రి వద్ద వదిలి వెళ్ళాడు. అయితే ఆమె కొద్దిసేపటికే మిస్ అయింది. ఆ తర్వాత కంటోన్మెంట్ పరిసర ప్రాంతంలో సదరు మహిళ ప్రమాదానికి గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆమె గొంతుపై కత్తిగాట్లను గమనించారు. దుండగులు ఆమెను గొంతుకోసి, ఆపై వాహనాన్ని ఆమె మీదుగా పోనిచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటనాస్థలికి చేరుకున్న మేజర్ మృతదేహం తన భార్యదేనని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె మృతిపై దర్యాప్తు జరుపుతున్నారు ఢిల్లీ పోలీసులు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!