ఆర్మీ మేజర్ భార్య గొంతుకోసి.. శరీరం మీదనుంచి వాహనం పోనిచ్చి..
- June 23, 2018
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఆర్మీ మేజర్ భార్యను గొంతుకోసి ఆపై వాహనాన్ని శరీరం మీదుగా పోనిచ్చారు. ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ వద్ద శనివారం ఓ మహిళ యాక్సిడెంట్లో గురైంది. అయితే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె గొంతు కోసి ఉండటాన్ని గమనించి.కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళ కొద్ది గంటలక్రితం మిస్ అయిన ఆర్మీ మేజర్ భార్యగా గుర్తించారు.
హత్యకు గురవకముందు 30 ఏళ్ల మహిళ స్థానికంగా ఉన్న ఫిజియోథెరపీ సెంటర్ కు వెళ్లారు. ఆమె భర్త మేజర్ కావటంతో అధికారిక వాహనంలో ఆమెను డ్రైవర్ ఆస్పత్రి వద్ద వదిలి వెళ్ళాడు. అయితే ఆమె కొద్దిసేపటికే మిస్ అయింది. ఆ తర్వాత కంటోన్మెంట్ పరిసర ప్రాంతంలో సదరు మహిళ ప్రమాదానికి గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆమె గొంతుపై కత్తిగాట్లను గమనించారు. దుండగులు ఆమెను గొంతుకోసి, ఆపై వాహనాన్ని ఆమె మీదుగా పోనిచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటనాస్థలికి చేరుకున్న మేజర్ మృతదేహం తన భార్యదేనని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె మృతిపై దర్యాప్తు జరుపుతున్నారు ఢిల్లీ పోలీసులు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







