ఆర్మీ మేజర్ భార్య గొంతుకోసి.. శరీరం మీదనుంచి వాహనం పోనిచ్చి..
- June 23, 2018
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఆర్మీ మేజర్ భార్యను గొంతుకోసి ఆపై వాహనాన్ని శరీరం మీదుగా పోనిచ్చారు. ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ వద్ద శనివారం ఓ మహిళ యాక్సిడెంట్లో గురైంది. అయితే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె గొంతు కోసి ఉండటాన్ని గమనించి.కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళ కొద్ది గంటలక్రితం మిస్ అయిన ఆర్మీ మేజర్ భార్యగా గుర్తించారు.
హత్యకు గురవకముందు 30 ఏళ్ల మహిళ స్థానికంగా ఉన్న ఫిజియోథెరపీ సెంటర్ కు వెళ్లారు. ఆమె భర్త మేజర్ కావటంతో అధికారిక వాహనంలో ఆమెను డ్రైవర్ ఆస్పత్రి వద్ద వదిలి వెళ్ళాడు. అయితే ఆమె కొద్దిసేపటికే మిస్ అయింది. ఆ తర్వాత కంటోన్మెంట్ పరిసర ప్రాంతంలో సదరు మహిళ ప్రమాదానికి గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆమె గొంతుపై కత్తిగాట్లను గమనించారు. దుండగులు ఆమెను గొంతుకోసి, ఆపై వాహనాన్ని ఆమె మీదుగా పోనిచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటనాస్థలికి చేరుకున్న మేజర్ మృతదేహం తన భార్యదేనని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె మృతిపై దర్యాప్తు జరుపుతున్నారు ఢిల్లీ పోలీసులు.
తాజా వార్తలు
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..







