యోగా గురువు ఫొటో షేర్ చేశాడు.. బుక్ అయ్యాడు
- June 24, 2018
ప్రముఖ సెలబ్రెటిలా ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేస్తున్నారు కొందరూ అకతాయిలు. తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి షేర్ చేశాడు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్లో బాబా రాందేవ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న ఫొటోను రహిషుద్దీన్ అనే వ్యక్తి షేర్ చేశాడు. దీనిపై ఆగ్రహించిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం ప్రకారం రహిషుద్దీన్పై కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తన ఫ్రెండ్ పంపడంతోనే తను ఈ ఫొటోను షేర్ చేశానని నిందుతుడు పోలీసుల ముందు వాపోయాడు.
మార్ఫింగ్ ఫొటోతో బాబా రాందేవ్ను కించపరిచేలా యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు నోయిడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణ.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







