రైతుల మధ్య ఘర్షణ.. 86 మంది మృతి
- June 25, 2018
రైతులకు, పశు వ్యాపారులకు మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో 86 మంది మృతిచెందారు. సెంట్రల్ నైజీరియాలో ఈ ఘటన జరిగింది. స్థానిక జాతులైన బెరోమ్ రైతులు, ఫౌలానీ పశు వ్యాపారుల మధ్య గురువారం భారీ ఘర్షణ జరిగింది. ఆ రోజు సుమారు అయిదు మంది చనిపోయారు. ఆ తర్వాత మళ్లీ శనివారం హింస చోటుచేసుకుంది. ఇక్కడున్న భూమి కోసం కొన్ని దశాబ్ధాలుగా స్థానిక తెగల మధ్య ఘర్షణలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రామస్థులు ఘర్షణకు దిగిన ఘటనలో 86 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు కమీషన్ ఉండి అడే తెలిపారు. 50 ఇండ్లు, 15 మోటర్సైకిళ్లు, రెండు వాహనాలను తగలబెట్టారు. హింస తర్వాత అక్కడ కర్ఫ్యూ విధించారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







