రైతుల మధ్య ఘర్షణ.. 86 మంది మృతి

- June 25, 2018 , by Maagulf
రైతుల మధ్య ఘర్షణ.. 86 మంది మృతి

రైతులకు, పశు వ్యాపారులకు మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో 86 మంది మృతిచెందారు. సెంట్రల్ నైజీరియాలో ఈ ఘటన జరిగింది. స్థానిక జాతులైన బెరోమ్ రైతులు, ఫౌలానీ పశు వ్యాపారుల మధ్య గురువారం భారీ ఘర్షణ జరిగింది. ఆ రోజు సుమారు అయిదు మంది చనిపోయారు. ఆ తర్వాత మళ్లీ శనివారం హింస చోటుచేసుకుంది. ఇక్కడున్న భూమి కోసం కొన్ని దశాబ్ధాలుగా స్థానిక తెగల మధ్య ఘర్షణలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రామస్థులు ఘర్షణకు దిగిన ఘటనలో 86 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు కమీషన్ ఉండి అడే తెలిపారు. 50 ఇండ్లు, 15 మోటర్‌సైకిళ్లు, రెండు వాహనాలను తగలబెట్టారు. హింస తర్వాత అక్కడ కర్ఫ్యూ విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com