'పాస్‌పోర్ట్ సేవా' యాప్‌ను ప్రారంభించిన సుష్మా స్వరాజ్

- June 26, 2018 , by Maagulf
'పాస్‌పోర్ట్ సేవా' యాప్‌ను ప్రారంభించిన సుష్మా స్వరాజ్

న్యూఢిల్లీ: పాస్‌పోర్టు దరఖాస్తును సులభతరం చేసి, సత్వరమే జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. 'పాస్‌పోర్టు సేవా దివస్'ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఇవాళ 'పాస్‌పోర్ట్ సేవా' యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాల అధికారులు, విదేశాంగ మంత్రిత్వశాఖ సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

భారత దేశంలో ఎక్కడినుంచైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు, మొబైల్ ఫోన్ల నుంచి పాస్‌పోర్టు అప్లికేషన్లు పూర్తి చేసుకునేందుకు వీలుగా రెండు పథకాలను సుష్మా స్వరాజ్ ప్రకటించారు. దీనిని ''పాస్‌పోర్టు విప్లవంగా'' ఆమె అభివర్ణించారు. ''హజ్ యాత్ర కోసం పాస్‌పోర్టులు, వీసాలు భారత ప్రజలకు నేరుగా అనుసంధానమయ్యే రెండు విషయాలని నేను భావిస్తున్నాను'' అని ఆమె పేర్కొన్నారు. హజ్ యాత్ర మైనారిటీ వ్యవహారాల శాఖ కిందికి వస్తుండగా... పాస్‌పోర్టు జారీ బాధ్యత విదేశాంగ మంత్రిత్వ శాఖ చూసుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com