ఫుట్ బాల్ మ్యాచ్ లో ఈజిప్ట్ టీమ్ ఓడిపోయిందని గుండెపోటుతో మృతి చెందిన కామెంటేటర్..

- June 26, 2018 , by Maagulf
ఫుట్ బాల్ మ్యాచ్ లో ఈజిప్ట్ టీమ్ ఓడిపోయిందని గుండెపోటుతో మృతి చెందిన కామెంటేటర్..

పుట్‌బాల్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. రష్యాలో జరుగుతున్న పిఫా వరల్డ్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోయిందని కేరళకు చెందిన అభిమాని ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఈసారి లైవ్‌లో కామెంటేటరీ చేస్తున్నఅబ్దుల్ రహీమ్ మొహమ్మద్ గుండెపోటుకు గురై మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సౌదీ అరేబియా చేతిలో ఈజిప్ట్ ఓడిపోయింది అన్న విషయం చెబుతూ భావోద్వేగానికి  గురయ్యాడు. ఆ సమయంలో ఛాతి నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్‌గా నిర్థారించారు. నిజానికి ఈ మ్యాచ్ మొదట్లో ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా గోల్‌తో ఆధిక్యంలో దూసుకెళ్లినా.. సౌదీఅరేబియాను ఓడించలేకపోయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com