బాబు గోగినేనిపై కేసు నమోదు.. ఆధారాలు ఇవ్వలేదన్న సీఐ..
- June 26, 2018
హేతువాది బాబు గోగినేనిపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఓ మతాన్ని కించ పరిచేలా మాట్లాడారని కేవీ నారాయణ కోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రైవేట్ కార్యక్రమానికి ఆధార్ నంబర్లను తీసుకోవడం పైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాబు గోగినేని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ పేరుతో ఇటీవల హైదరాబాద్, విశాఖ, బెంగళూరులో సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన వారి నుంచి ఆధార్ నెంబర్లు తీసుకున్నారు. వీటిని మలేషియా కంపెనీకి విక్రయించినట్టు కేవీ నారాయణ ఆరోపించారు. అలాగే సోషల్ మీడియాలో సౌదీ ఉగ్రవాద దేశమని బాబు గోగినేని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆ దేశానికి, మనకు మధ్య సత్ సంబంధాలు దెబ్బతింటాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ మత గ్రంథాలను బాబు గోగినేని కించపరిచారని పిటిషనర్ పేర్కోన్నారు. దీంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బాబు గోగినేని పై 13 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఐతే.. తమకు ఫిర్యాదు చేసిన కేవీ నారాయణ ఇంకా పూర్తి ఆధారాలు తమకు ఇవ్వలేదని.. మాదాపూర్ పీఎస్ సీఐ కళింగరావు చెప్పారు. ఆధారాలు సమర్పించాక బాబు గోగినేనిపై చర్యలు తీసుకుంటామన్నారు కళింగరావు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







