బాబు గోగినేనిపై కేసు నమోదు.. ఆధారాలు ఇవ్వలేదన్న సీఐ..
- June 26, 2018
హేతువాది బాబు గోగినేనిపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఓ మతాన్ని కించ పరిచేలా మాట్లాడారని కేవీ నారాయణ కోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రైవేట్ కార్యక్రమానికి ఆధార్ నంబర్లను తీసుకోవడం పైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాబు గోగినేని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ పేరుతో ఇటీవల హైదరాబాద్, విశాఖ, బెంగళూరులో సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన వారి నుంచి ఆధార్ నెంబర్లు తీసుకున్నారు. వీటిని మలేషియా కంపెనీకి విక్రయించినట్టు కేవీ నారాయణ ఆరోపించారు. అలాగే సోషల్ మీడియాలో సౌదీ ఉగ్రవాద దేశమని బాబు గోగినేని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆ దేశానికి, మనకు మధ్య సత్ సంబంధాలు దెబ్బతింటాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ మత గ్రంథాలను బాబు గోగినేని కించపరిచారని పిటిషనర్ పేర్కోన్నారు. దీంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బాబు గోగినేని పై 13 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఐతే.. తమకు ఫిర్యాదు చేసిన కేవీ నారాయణ ఇంకా పూర్తి ఆధారాలు తమకు ఇవ్వలేదని.. మాదాపూర్ పీఎస్ సీఐ కళింగరావు చెప్పారు. ఆధారాలు సమర్పించాక బాబు గోగినేనిపై చర్యలు తీసుకుంటామన్నారు కళింగరావు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







